హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : రెండేండ్ల క్రితం ప్రారంభమైన నియామక ప్రక్రియలో భాగంగా శిశు సంక్షేమ శాఖలోని గ్రేడ్-1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్లకు ప్రభుత్వం న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘రెండేండ్ల క్రితం ప్రారంభమైన మహిళా శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్-1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల నియామక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. చేయని నేరానికి వాళ్లను కోర్టుల చుట్టూ తిప్పుతుంది కాంగ్రెసు ప్రభుత్వం. దయచేసి వారికి న్యాయం చేయండి’ అంటూ ట్వీట్ చేశారు. ట్వీట్ను @TSPSCofficial, @Telangana CSకు ట్యాగ్ చేశారు.