హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టుకు నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అలోక్ అరాధే ఈ నెల 23న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో ఆయనతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన జస్టిస్ అరాధే ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. పదోన్నతిపై రాష్ట్ర హైకోర్టు సీజేగా రానున్నారు.