KTR | జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టులోని తొమ్మిదో నెంబర్ గేట్ రోప్ తెగిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ఒక్క ఇటుక పేర్చడం కూడా చేతకాని ముఖ్యమంత్రికి.. కనీసం ఉన్న ప్రాజెక్టు నిర్వహణ కూడా రాకపోవడం వల్లే ఇవాళ జూరాల ప్రాజెక్టు డేంజర్లో పడిందన్నారు. ప్రతిఏటా వరద వస్తుందని తెలిసినా స్పిల్ వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయించడంలో రేవంత్ సర్కారు నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. జూరాలకు క్రమంగా వరద ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలని హితవు పలికారు.
జూరాల ప్రాజెక్టులోని 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడం కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం.
ఒక్క ఇటుక పేర్చడం కూడా చేతకాని ముఖ్యమంత్రికి కనీసం ఉన్న ప్రాజెక్టు నిర్వహణ కూడా రాకపోవడం వల్లే ఇవాళ జూరాల ప్రాజెక్టు డేంజర్ లో పడింది.
ప్రతిఏటా వరద వస్తుందని తెలిసినా…
— KTR (@KTRBRS) June 26, 2025
ఇప్పటికే ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని.. పెద్దవాగుకు గండిపడి 16 గ్రామాలు ముంపునకు గురయ్యాయని గుర్తు చేశారు. వట్టెం పంప్హౌస్ మునిగిపోయిందని.. సుంకిశాల రిటైనింగ్ వాల్ కుప్పకూలి వందల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. తాజాగా జూరాల 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడంతోపాటు ఇతర గేట్ల రోప్లు బలహీనంగా ఉండడం ప్రాజెక్టును ప్రమాదంలోకి నెట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు, ఎగువ నుంచి పెరుగుతున్న ఇన్ ఫ్లో ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పకడ్బందీగా వ్యవహరించాలని, జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా సూచించారు.
రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం..
డేంజర్లో జూరాల ప్రాజెక్ట్!తెగిపోయిన 9వ నంబర్ గేట్ రోప్..
ఇతర గేట్ల రోప్ లు బలహీనం..
క్రమంగా పెరుగుతున్న వరద ఉదృతితో ప్రాజెక్టును ప్రమాదంలోకి నెట్టింది.ప్రతిఏటా వరద వస్తుందని తెలిసినా.. స్పిల్ వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయించడంలో రేవంత్ సర్కారు… pic.twitter.com/iuuhweOzhG
— BRS Party (@BRSparty) June 26, 2025