TREIRB | హైదరాబాద్ : రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో 1924 జూనియర్ లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ఈ ఫలితాలను గురుకుల నియామక బోర్డు గురువారం విడుదల చేసింది.
డిగ్రీ కాలేజీల్లో 793 అధ్యాపకుల ఉద్యోగ రాత పరీక్ష ఫలితాలను బుధవారం విడుదల చేసిన అధికారులు.. తాజాగా జేఎల్ పోస్టులకు ఎంపికైన వారి ప్రాథమిక జాబితాను సబ్జెక్టుల వారీగా విడుదల చేశారు. ఈ జాబితాలను ట్రిబ్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. జేఎల్ రాత పరీక్షలను గతేడాది ఆగస్టు 3 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. దివ్యాంగుల కేటగిరీ ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. గురుకుల జూనియర్ లెక్చరర్ల జాబితా కోసం treirb.cgg.gov.in అనే వెబ్సైట్ను లాగిన్ అవ్వండి.