మహబూబ్నగర్ మే 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీకి తొలిసారి జరిగిన ఎన్నికల్లో 27 స్థానాలకు గాను 23 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపుబావుటా ఎగరేశారు. అచ్చంపేట మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకుగానూ 13 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించి సత్తా చాటారు. ఫలితాలపట్ల జడ్చర్ల ఎమ్మెల్యే డా.సీ లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఈ గెలుపు ఓ నిదర్శనంగా నిలుస్తుందన్నారు. అచ్చంపేటలో టీఆర్ఎస్కుపట్టంకట్టిన ప్రజలకు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కృతజ్ఞతలు తెలిపారు.