హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు ఉత్పత్తికేంద్రాల నిర్మాణంపై ప్రభుత్వం నియమించిన జ్యుడీషియల్ కమిషన్ విచారణను ప్రారంభించింది. ఈ మూడు అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడం, ఒప్పందాలు చేసుకోవడంలో భాగస్వామ్యమైన 20 మందికిపైగా అధికారులు, సభ్యులకు ఆదివారం నోటీసులు జారీచేసింది. కమిషన్ చైర్మన్గా జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి.. ఇంకా కొంతమంది అధికారులకు నోటీసులు పంపించాల్సి ఉండగా, ఈ వారంలో వారికి కూడా నోటీసులు అందజేయనున్నారు.
వీరిలో ప్రస్తుతం పనిచేస్తున్నవారితో పాటు పదవుల నుంచి వైదొలిగినవారున్నారు. ప్రస్తుతం నోటీసుసులు అందుకొన్నవారిలో రాజకీయనేతలెవరులేరని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇక నోటీసులందుకున్న వారు తమ ముందు హాజరయ్యి వాదనలు వినిపించవచ్చని కమిషన్ తెలిపింది. ఈ మూడు అంశాలపై కమిషన్ ప్రజల నుంచి సైతం అభిప్రాయాలు సేకరిస్తున్నది.