ఆసిఫాబాద్ టౌన్, జూన్ 17: ప్రభుత్వ అధికారిక వాహనం ఉన్నప్పటికీ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జకుల అనంతలక్ష్మి బుధవారం కాలినడకన విధులకు వచ్చారు. ఇంధన కొరత, కాలుష్య నివారణకు ప్రజల్లో చైతన్యం కల్పించడానికి సుమారు 1.5 కిలోమీటర్లు నడిచి కోర్టుకు వచ్చినట్టు ఆమె పేర్కొన్నారు.
ఇంధన కొరత, కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రతి రోజూ కొంతదూరం నడిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.