నాంపల్లి కోర్టులు, జూన్ 5 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కోస్గి వెంకట జనార్దన్, కోస్గి మైబయ్య, రవికుమార్, భగవంత్కుమార్, పూల రవికిశోర్, ధనావత్ భరత్నాయక్, పశికంటి రోహిత్కుమార్, గాదే సాయిమధు, తరఫున వేసిన బెయిల్ పిటిషన్లపై న్యాయవాదులు వాదనలు పూర్తి చేశారు.
న్యాయమూర్తి తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు. కొంతం మురళీధర్రెడ్డి, ఆకుల మనోజ్కుమా ర్, అట్ల సుచరితారెడ్డి, ప్రధాన నిందితుడు ప్రవీణ్కుమార్ పిటిషన్లకు సిట్ పీపీ కౌంటర్ దాఖలు చేశారు. కేసు వాయిదా పడింది.