హైదరాబాద్ : రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. దరఖాస్తుల సమర్పణ విషయంలో ఆన్లైన్లో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మరో 10 రోజుల పాటు గడువు పొడిగిస్తున్నట్లు ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ రాజమౌళి ప్రకటించారు.
స్టేట్ లెవల్ అక్రిడేషన్ దరఖాస్తులకు జూన్ 15 వరకు, జిల్లా స్థాయి అక్రిడేషన్ దరఖాస్తులకు జూన్ 20వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఆయా మీడియా సంస్థలు ప్రతిపాదించిన జర్నలిస్టులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు. దాంతో పాటు సంస్థ ప్రతిపాదించిన జాబితాను కూడా సమర్పించాలన్నారు.