హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు నిర్మా ణ ఫలితంగా రాష్ట్రంలో వాటిల్లనున్న ముంపుపై ఆరుగురి చొప్పున తెలం గాణ, ఏపీ రాష్ర్టాల అధికారులు ఈ నెల 9 నుంచి జాయింట్ సర్వే నిర్వహించనున్నారు. ఎన్జీటీ మార్గదర్శకాల మేరకు ఏపీ, తెలంగాణ ఈ సర్వేను చేపట్టనున్నాయి.
ప్రాజెక్టు ముంపు అంచనాలపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ ప్రభావిత రాష్ర్టాలు ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఎన్జీటీని ఆశ్రయించాయి. ముంపు ప్రభావిత రాష్ర్టాలతో సర్వేను చేపట్టాలని ఏపీని ఎన్జీటీ ఆదేశించింది. తొలుత తెలంగాణతో కలిసి ఏపీ సర్వే నిర్వహించనున్నది. ఎఫ్ఆర్ఎల్ స్థాయిలో నీటిని నిల్వ చేసినప్పుడు 893 ఎకరాలు ముంపునకు గురవుతున్నట్టు గతంలోనే తెలంగాణ స్పష్టం చేసింది. సర్వేలో ముంపు ప్రాంతాల డిమార్కేషన్ చేపట్టనున్నారు.