నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్(Former ZP Chairman) గంట సదానందం బీఆర్ఎస్( BRS )పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు , ఆర్మూర్ ఎమ్మెల్యే(Armoor Mla ) ఆశన్నగారి జీవన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సదానందంకు ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా పరిషత్ పై టీఆర్ఎస్(TRS) గులాబీ జెండా ఎగరడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగించడంతో పాటు ఉద్యమానికి ఎంతో ఊపిరి ఇచ్చింది. నాడు మాజీ మంత్రి శనిగరం సంతోశ్రెడ్డిని జడ్పీ చైర్మన్గా కేసీఆర్ నియమించారు. అనంతరం రెండు సంవత్సరాలకు వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని కేసీఆర్ ఆదేశాల మేరకు సంతోష్రెడ్డి జడ్పీ చైర్మన్గా రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.
జడ్పీ చైర్మన్ పదవి ఖాళీ కావడంతో వైస్ చైర్మన్గా ఉన్న కిషన్రావు కొన్ని నెలల పాటు ఇన్చార్జి చైర్మన్గా కొనసాగారు. అనంతరం పార్టీ ఆదేశాల మేరకు సదానందంకు అవకాశం రావడంతో ఆయన కొన్ని నెలల పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చైర్మన్గా పనిచేశారు.