నల్లగొండ : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా చిట్యాల మండలం వెలినినేడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుంచి 50 కుటుంబాలు ఎమ్మెల్యే చిరుమర్తి(MLA Chirumurthy) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో టేకుల మల్లారెడ్డి, టేకుల రాజిరెడ్డి, ఏనుగు అనిల్ రెడ్డి, పైళ్ల రఘువీరా రెడ్డి, సామకురి శంకరయ్య, గోలి యాదయ్య, పైళ్ల వాసుదేవా రెడ్డి, మధుసూధన్ తదితరులు ఉన్నారు. అలాగే నార్కట్పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామానికి చెందిన పెడ్డగౌడ్, వంగాల శంకర్ గౌడ్, ఉగ్గపల్లి శ్రీను, ఉగ్గపల్లి లోకేష్ ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.