నల్లగొండ : జిల్లాలోని రామన్నపేట పట్టణానికి చెందిన కురుమ సంఘం, హమాలీ సంఘం నుంచి సుమారు 100 మంది ఎమ్మెల్యే చిరుమర్తి(MLA Chirumurthy Lingaiah) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కురుమ సంఘం ఉపాధ్యక్షడు ఈతకుల రాజు, హమాలీ సంఘం నాయకులు ఏనుగు నరసింహ, మేట అంజయ్య, మేట మోగులయ్య, రేగు జంగయ్య, బెడద మల్లయ్య, గొరిగే శ్రీ శైలం, ఉట్కురి నరేష్, ఉట్కూరి ఉపేందర్, గదరాజు శంకరయ్య, గుండాల సత్తయ్య, నాగటి అంజయ్య, నకిరెకంటి గోపాల్, సింగం మల్లయ్య తదితరులు ఉన్నారు.
కాగా, నకిరేకల్ మండలం నోముల గ్రామస్థులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యని మర్యాద పూర్వకంగా కలిసి నూతనంగా నిర్మించనున్న ముత్యాలమ్మ గుడి నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలియజేయాలని కోరారు.