నల్లగొండ : నల్లగొండ జిల్లా నార్కట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం గ్రామానికి చెందిన కుమ్మరి కులస్తులు 50 కుటుంబాలు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కత్తుల భిక్షం, మేడి యాదగిరి, మేడి చిన్న భిక్షం, మేడి గుండు రాములు, ఇంద్రకంటి ఈశ్వర్, పాలె యాదయ్య, లింగాల ముత్తయ్య, పాల రమేష్, మేడి వాసు, రామలింగయ్య, మేడి అశోక్, గుండు శంకర్, తీగల బాలస్వామి ఉన్నారు.
అంతకు ముందు ఎల్లారెడ్డిగూడెం ఎస్సీ కాలనీలోని చిన్న మేడి వారి ఎల్లమ్మ గుడి, హైస్కూల్ ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే డాక్టరేట్ సాధించిన గ్రామానికి చెందిన గాదె వంశీధర్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడి పుష్పలత, చిట్యాల మార్కెట్ వైస్ చైర్మన్ కొండూరు శంకర్, కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రేగటి నారాయణరెడ్డి, వార్డు మెంబర్లు, పాల్గొన్నారు.