నల్లగొండ : సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన వారు బీఆర్ఎస్లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కట్పల్లి క్యాంపు కార్యాలయంలో చిట్యాల మండలం ఏపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు,నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. పాత కొత్త అనే తేడా లేకుండా అందరు కలిసి పార్టీని మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు.
పార్టీలో చేరిన వారిలో బాతరజు వెంకటేష్, సూరేపల్లి కృష్ణ, కొణతం వెంకటేష్, తాటి మధు, అంతటి రవితేజ, తర్ర సాయి, చికినమెట్ల శంకర్, బండ ప్రవీణ్, బోల్లపల్లి సందీప్, గోలి కిశోర్, మందుల శ్రీకాంత్, మందుల సురేష్, దేవతల వంశీ, మందుల లక్ష్మణ్, పొలగొని శివ, దినేష్, తర్ర శ్రీశైలం, ఎనమల్ల సతీష్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ పాలెం మల్లేష్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొలను సతీష్, ఎంపళ్ల భూపాల్ రెడ్డి, యువజన నాయకులు పాలెం మహేష్, దేవతల శివ, సామ నరేష్, ఎల్లంకి సురేష్, బండ సురేష్, బండ శివ పాల్గొన్నారు.