సూర్యాపేట : సూర్యాపేట(Suryapet) నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) మద్దతుగా బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతున్నది. తాజాగా పెన్పహాడ్ మండలంలోని మంత్రి దత్తత గ్రామమైన చీదెళ్ల లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో రవీందర్ రెడ్డి, వెన్న సీతారాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నలబోలు వెంకటరెడ్డి, గుర్రం రాంరెడ్డి, పల్లె వెంకట్ రెడ్డి, హుస్సేన్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పరెడ్డి సీతారాంరెడ్డి, ఎంపీటీసీ జూలకంటి వెంకటరెడ్డి, రైతు సమన్వయ సమితి నాయకులు గుర్రం అమృతారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు కీర్తి వెంకట్రావు పాల్గొన్నారు.