అలంపూర్: కోటి లింగాలకు కొలువైన అలంపూరు క్షేత్రంలోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యో గులు, వ్యాపారులు, బందుమిత్ర, కుటుంబ సమేతంగా ఆలయాలను దర్శించుకున్నారు.
స్వామి వారి ఆలయంలో అభిషేకాలు, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు మొదలగు పూజా కార్యక్రమాలు నిర్వ హించారు. తుంగబద్రా నదిలో స్నానాలాచరించి ఆలయాలను దర్శించుకున్నారు. ఆలయ పరిసరాల్లోని పరివార దేవతా ఆలయాలను సందర్శించారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అంద జేసి ఆశీర్వదించారు. దేవస్థానం వారి అన్నదానం సత్రంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు.