హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా మరో రెండు మండలాలు, ఒక గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం సోమవారం వేర్వేరుగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవల్లిని మండలంగా ప్రకటిస్తూ ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసి అభిప్రాయాలను సేకరించింది.
తాజాగా తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. కామారెడ్డి జిల్లామహమ్మద్నగర్ను నూతన మండలంగా ఏర్పాటు చేస్తూ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం బొగారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బార్సిగూడను నూతన రెవెన్యూ గ్రామంగా ఏర్పాటుచేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యంతరాలుంటే తెలపాలని ఆ నోటిఫికేషన్లలో పేర్కొన్నది.