హైదరాబాద్ : ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీపై మాట్లాడకుండా రాష్ట్రంలోని పేపర్ లీకు వీరులు నిరుద్యోగ మార్చ్(Un employees) చేయడం హాస్యాస్పదంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్(Chief Whip) దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. ఆదివారం బీఆర్ఎస్ఎల్పీ(BRS LP) కార్యాలయంలో ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కె. వాసుదేవ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ(BJP)కి నిరుద్యోగుల గురించి మాట్లాడే హక్కు లేదని ఆరోపించారు.
నరేంద్ర మోదీ(Narendra Modi) రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని వాటి గురించి ఢిల్లీలో మోదీకి వ్యతిరేకంగా మార్చ్ చేయాలని సూచించారు. వరంగల్ మార్చ్ లో నిరుద్యోగులు లేరని అడ్డ మీద కూలీలే ఉన్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పలు నోటిఫికేషన్లకు నిరుద్యోగులు సిద్ధమవుతున్నారని వారు రోడ్లపైకి వచ్చే పరిస్థితులు లేవని పేర్కొన్నారు.కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని అన్నారు.
వివిధ దశల్లో మిగతా ఉద్యోగాల భర్తీ సాగుతోందని అన్నారు. పదో తరగతి పేపర్ల లీకేజీ కుట్ర దారు అని వాట్సాప్ చాట్ లతో రుజువైందని అన్నారు. బీఆర్ఎస్ ది గాంధీ సిద్ధాంతం. బీజేపీ ది గాడ్సే సిద్ధాంతమని వెల్లడించారు. కేసీఆర్ ను గద్దె దిగాలని బీజేపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని,రైతు బంధు, ఇతర సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నందుకు కేసీఆర్ గద్దె దిగాలా అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు.
అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చర్యకు రావాలని సవాలు విసిరారు. కేసీఆర్ కుటుంబం కాదు తెలంగాణ కుటుంబ పాలన తెలంగాణ లో అమలవుతోందని వెల్లడించారు. మంత్రి కేటీఆర్ను విమర్శించే స్థాయి బీజేపీ నేతలకు లేదని స్పష్టం చేశారు.