హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): వివిధ ఉపాధి కోర్సులలో నిరుద్యోగ యువత న్యాక్ ద్వారా శిక్షణ తీసుకొని మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంయుక్తంగా వివిధ ఉపాధి కోర్సులలో ఉచితంగా శిక్షణ నిర్వహిస్తున్నాయని తెలిపారు. సోమవారం నగరంలోని గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో ఆమె సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసుకొన్న 39 మంది విద్యార్థులకు ప్లేస్మెంట్ ఆఫర్ లెటర్స్ను అందజేశారు. నిబద్ధత, పట్టుదలతో పనిచేసి మంచి ఇంజినీర్లుగా పేరు తెచ్చుకోవాలని క్రిస్టినా జడ్ చోంగ్తు సూచించారు. కార్యక్రమంలో న్యాక్ డైరెక్టర్ జనరల్ కే భిక్షపతి, ట్రైకార్ జనరల్ మేనేజర్ కే శంకర్రావు, స్టేట్ మిషన్ మేనేజర్ ఎం లక్ష్మీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.