హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ హకీంపేటలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఈ నెల 28న జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ జాబ్మేళాకు 37 నుంచి 57 ఏండ్ల వయసున్న సైనికులు, మాజీ సైనికులు అర్హులు అని పేర్కొన్నారు.
50 మంది కార్పొరేట్లు, 2 వేల మంది ఇతర శాఖల అనుభవజ్ఞులు పాల్గొనే ఈ జాబ్మేళాను ఎస్వోఏ, హెచ్ క్యూ ట్రైనింగ్ కమాండ్ ఎయిర్ వైస్ మార్షల్ పీకే ఘోష్ ప్రారంభిస్తారని చెప్పారు. దరఖాస్తుఫారాలను https: //dgrindia.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.