Hyderabad | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఐటీ రంగ ముఖచిత్రమే అమాంతంగా మారిపోయింది. ఇప్పటివరకు జరిగిన ఐటీ ఉద్యోగాల్లో 143 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న సులభతరమైన, పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికా విధానాలే ఇంతటి మార్పునకు కారణమని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ ఏర్పడకముందు ఐటీ అంటే బెంగళూరు పేరే వినిపించేది. ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీకి హైదరాబాద్ చిరునామాగా మారింది. ఐటీ, ఐటీఈఎస్ కార్యకలాపాల కోసం వినియోగించే ఏ గ్రేడ్ ఆఫీసు స్పేస్ లీజింగ్లోనూ హైదరాబాద్ బెంగళూరును మించిపోయింది. ఇదంతా తెలంగాణ ప్రభుత్వ విధానాలు, పనితీరు వల్లేనని ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ సమగ్ర కార్యాచరణ విధానాల వల్ల ఐటీ ఉద్యోగావకాశాలు 24 శాతం వృద్ధి చెందాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో స్థానం పొందిన 20కి పైగా బహుళజాతి కంపెనీలు (ఎంఎన్సీ) హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి.
విశేషం: దేశంలోని మొత్తం ఐటీ ఉద్యోగాల్లో 44 శాతం వాటా తెలంగాణదే. టాప్-5 గ్లోబల్ టెక్ కంపెనీలు హైదరాబాద్లోనే ఉన్నాయి. బెంగళూరును కాదని హైదరాబాద్లో ఉద్యోగాల కోసం నెలకు 10 వేల మంది టెక్ ఉద్యోగులు లొకేషన్ షిఫ్ట్కు ఐప్లె చేస్తున్నారు. మౌలిక వసతులు, లివింగ్ కాస్ట్ తదితర అంశాలే కారణంగా పలువురు చెబుతున్నారు.