హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూహెచ్లో బీటెక్ (ఈఈఈ) మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి వీ మణికంఠరాజుకు యువ పారిశ్రామికవేత్తగా అవార్డు లభించింది. లీడర్ అవార్డు 2022 టాప్ 50 లీడర్స్ ఆఫ్ ఇండియా ఆయనను అవార్డుకు ఎంపిక చేసింది. మణికంఠరాజు చిన్నతనంలోనే ఫైన్ఎక్స్ ఫైనాన్షియల్ క్యాష్బ్యాక్ యాప్ను రూపొందించారు. దీనిని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినది. 2021 సెప్టెంబర్ 17న జేఎల్ఎం సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట ఆయన సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించారు. కాగా, మణికంఠను ఆ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్, ప్రిన్సిపాల్ ప్రభుకుమార్, ఈఈఈ విభాగం హెడ్ డాక్టర్ ఏ జయకుమారి అభినందించారు.
యాప్ ఉపయోగాలు
అనేక రకాల యాప్లతో ఫోన్ మెమోరి లాస్ అవుతుంది, కానీ ఫైనాన్షియల్ క్యాష్బ్యాక్ యాప్ ఫోన్ మెమోరిపై ఎలాంటి ప్రభావం చూపదని మణికంఠరాజు తెలిపారు. స్టాక్ మార్కెట్పై ఆసక్తి ఉన్న వారికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతున్నదన్నారు. అకౌంట్ ఓపెనింగ్కు సంబంధించి.. ఆదాయాన్ని ట్రాక్ విధానం ద్వారా ఎప్పటికప్పుడు ఈ యాప్ ద్వారా తెలుసుకొనే అవకాశం ఉంటున్నదని వివరించారు.