హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : బీ ఫార్మసీ మొదటి సెమిస్టర్ తరగతులను ఈ నెల 29 నుంచి ప్రారంభించాలని జేఎన్టీయూ ఆదేశించింది. ఈ మేరకు అకడమిక్ క్యాలెండర్ను జేఎన్టీయూ విడుదల చేసింది. ఫస్ట్ సెమిస్టర్ తరగతులను 29 నుంచి ప్రారంభించాలని కాలేజీలకు సూచించింది. అదేరోజు విద్యార్థులకు ఓరియంటేషన్ నిర్వహించాలని తెలిపింది. రెండో సెమిస్టర్ తరగతులు 2024 మార్చి 21 నుంచి ప్రారంభించాలని సూచించింది.