హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): అడ్వాన్స్డ్ యూఎక్స్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ నిర్వహణకు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ)తో డిజైన్ గురు సంస్థ ఎంఓయూను కుదుర్చుకున్నది. మంగళవారం మాసబ్ట్యాంక్లోని యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఒప్పంద పత్రాలపై వీసీ ప్రొఫెసర్ ఎన్ కవితా దర్యానీరావు, డిజైన్ గురు వ్యవస్థాపకుడు ప్రవీణ్ ఇందూరి సంతకాలు చేశారు.
యూజర్ ఎక్స్పీరియన్స్ (యూఎక్స్)లో అడ్వాన్స్డ్ సర్టిఫికెట్ కోర్సును ఆన్లైన్, ఆఫ్లైన్లో నిర్వహిస్తారు. శనివారం ఆన్లైన్లో, ఆదివారం ఆఫ్లైన్లో తరగతులు జరుగుతాయి. జేఎన్ఏఎఫ్ఏయూ విద్యార్థులు, వృత్తి నిపుణులు, వర్సిటీతో సంబంధంలేని ఔత్సాహికులూ ఈ కోర్సులో చేరవచ్చు. మూడు నెలల వ్యవధి గల ఈ కోర్సు ఫీజు రూ.15 వేలుగా ఉన్నది. ఇతర కాలేజీల విద్యార్థులకు రూ.29 వేలు ఫీజుగా చెల్లించాలని ప్రవీణ్ ఇందూరి తెలిపారు. మరిన్ని వివరాల కోసం www.jangfau.ac.in, www.designguruhyderabad.com వెబ్సైట్ను సంప్రదించాలని పేర్కొన్నారు.