హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : జేఈఈ పేపర్-2 (బీ ఆర్క్, బీ ప్లానింగ్) ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. జనవరి 29న ఈ రెండు పరీక్షలు నిర్వహించగా, ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది.
పేపర్ 2ఏ (బీఆర్క్)లో తెలంగాణ విద్యార్థి తెల్లూరి శ్రేయాస్ రెడ్డి 99.99 పర్సంటైల్తో స్టేట్ టాపర్గా నిలిచాడు. పేపర్-2బీ (బీ ప్లానింగ్)లో మద్దూరి నాగ ప్రద్యుమ్నారెడ్డి 99.99పర్సంటైల్తో స్టేట్ టాపర్గా నిలిచాడు.