హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ -1 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. బుధవారం పేపర్ -2ఏ (బీఆర్క్), పేపర్ -2బీ (బీప్లానింగ్) పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తారు. బీఆర్క్, బీ ప్లానింగ్కు 180 నిమిషాల చొప్పున పరీక్ష ఉంటుంది.
ఈ రెండింటికి హాజరయ్యే అభ్యర్థులకు 210 నిమిషాల పాటు సమయాన్నిస్తారు. ఇక పేపర్-1 ( బీఈ/ బీటెక్) పరీక్షలు ఈ నెల 27 ,29, 30, 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో జరుగుతాయి.