హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ -2 అడ్మిట్కార్డులను https ://jeemain.nta.nic. in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్షల విభాగం సీనియర్ డైరెక్టర్ సాధనా పరాశర్ తెలిపారు. దేశవ్యాప్తంగా 330 నగరాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 9.4 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 50 వేలకు పైగా విద్యార్థులు జేఈఈ మెయిన్ రాయనున్నారని పేర్కొన్నారు. ఐఐటీలు, ఎన్ఐటీలు సహా ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలు ఈ నెల 6 నుంచి ప్రారంభంకానున్నాయి. సందేహాలకు 011 -40759000, jeemain@nta.nic. in ఈ మెయిల్ను సంప్రదించాలని సాధనా పరాశర్ సూచించారు.