హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్కార్డులను సోమవారం ఐఐటీ గువాహటి విడుదల చేసింది. జూన్ 4న ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 : 30 గంటల నుంచి సాయంత్రం 5 : 30 గంటల వరకు ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా ఐఐటీలు సహా ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు.