హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): జేఈఈ అడ్వాన్స్డ్లో సిలబస్లో స్వల్పమార్పులు చేశారు. జేఈఈ మెయిన్లో ఉన్న పాఠ్యాంశాలను అడ్వాన్స్డ్లోనూ చేర్చా రు. ఈ మేరకు జేఈఈ అడ్వాన్స్డ్-2023 సిలబస్ను ఐఐ టీ ఖరగ్పూర్ గురువారం ఖరారు చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లో పొందుపరిచింది. జేఈఈ మెయిన్లో ఉన్న పాఠ్యాంశాలనే అడ్వాన్స్డ్ సిలబస్లో చేర్చారని, పెద్దగా మార్పులేమీ లేవని శ్రీచైతన్య ఐఐ టీ ఆలిండియా కో ఆర్డినేటర్ ఉమాశంకర్ అభిప్రాయపడ్డారు. మారిన సిలబస్ ప్రకారం ఆయా పాఠ్యాంశాల నుం చి ఒకటి రెండు ప్రశ్నలు వచ్చే అవకాశముందని చెప్పారు.
మార్పులిలా..