భైంసా టౌన్, జూన్ 4: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని తిమ్మాపూర్కు చెందిన జవాన్ కత్తి పోతన్న (36) కరోనాతో మృతిచెందాడు. పోతన్నకు 20 రోజుల కిందట కరోనా పాజిటివ్ వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్లోని మిలటరీ వైద్యశాలలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. పోతన్న మృతదేహాన్ని దవాఖానలో అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలికి.. కుటుంబసభ్యులకు అప్పగించారు. పోతన్న ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని భోపాల్లో టెక్నికల్ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.