హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో సభ నిర్వహణకు అనుమతి కోరుతూ జనసేన పార్టీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ను హైకోర్టు రిజిస్ట్రీ ప్రాథమిక దశలోనే తిరసరించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సం దర్భంగా మంగళవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్లో జనసేన సాధకుల సభ నిర్వహణ కోసం సమర్పించిన దరఖాస్తును సైబరాబాద్ పోలీ సులు తిరసరించడాన్ని సవాలు చేస్తూ జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రాంప్రసాద్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
జనసేన సభ నిర్వహణకు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ను హైకోర్టు రిజిస్ట్రీ తిరసరించింది.