హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జమున మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలియజేశారు. ఆమె మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు. తొలితరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి, తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమున జ్జాపకాలను సీఎం స్మరించుకొన్నారు. తెలుగు, తమిళం, కన్నడంలోనే కాకుండా హిందీ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారని కొనియాడారు. జమున పార్లమెంట్ సభ్యురాలిగా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఆమె కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి సంతాపం ప్రకటించారు.
జమున మృతికి మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావుతోపాటు టీఎస్ఐడీసీ చైర్మన్ వేణుగోపాలచారి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ సంతాపం తెలిపారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.