భువనగిరి కలెక్టరేట్/ చౌటుప్పల్: యాదాద్రి భవనగిరి జిల్లాలోని 17 మండలాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉద యం వరకు భారీ వర్షం కురిసింది. అత్యధికంగా చౌటుప్పల్ మండలంలో 197 మి.మీ. వర్షపాతం నమోదైంది. సంస్థాన్ నారాయణపూర్ మండలంలో 109.4మి.మీ., ఆలేరులో 35.8, రాజాపేటలో 30.8, యాదగిరిగుట్టలో 28.6, భువన గిరిలో 27.4, తుర్కపల్లి(ఎం)లో 25.2, వలిగొండలో 22.4, భూదాన్ పోచంపల్లిలో 18.6, బీబీనగర్లో 18.4, రామ న్నపేటలో 16.2, ఆత్మకూర్(ఎం)లో 10.6, బొమ్మలరామారంలో 9, మోత్కూరు మండలంలో 4.2 మి.మీ. వర్ష పాతం నమోదైందని అధికారులు తెలిపారు.
చౌటుప్పల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం
చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలంలో భారీ వర్షం కురువడంతో మున్సిపాలిటీ కేంద్రంలోని పలు కాలనీలు జల దిగ్బంధం లో చిక్కుకున్నాయి. ఆర్డీవో, ఎంపీడీవో కార్యాలయాలు, ఆర్టీసీ బస్టాండ్, గాంధీ పార్కు వరద నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలైన గాంధీ పార్కు, రాంనగర్, విద్యానగర్ తదితర కాలనీలు జలమయమయ్యాయి. చిన్నకొండూరు చౌరస్తా , ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చౌటుప్పల్ లోతట్టు ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున వరద చేరింది. చౌటుప్పల్ పెద్ద చెరువు నిండి అలుగు పోస్తుండడంతో కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు ఆధ్వర్యంలో కౌన్సిలర్లు చేపట్టారు.
కాలనీల్లో చేపల వేట..
నిత్యం రాకపోకలతో బిజీగా ఉండే చౌటుప్పల్ పట్టణంలోని పలు కాలనీల్లో వరద పోటెత్తడంతో స్థానికులు ఆదివారం చేపలు పటాటరు. వరద నీటిలో కొట్టుకొస్తున్న చేపలను పట్టేందుకు యువత ఆసక్తి చూపారు.