హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారనే నెపంతో ఓసీ ఉద్యోగులను వదిలిపెట్టి కేవలం బీసీ ఉద్యోగులనే కాంగ్రెస్ ప్రభుత్వం బలి చేస్తున్నదని, ఇది సమంజసం కాదని సీఎం రేవంత్రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తారు తప్ప సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదన్న విషయాన్ని గుర్తించాలని కోరారు. బీసీ ఉద్యోగుల మీద ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని విన్నవించారు. బీసీ ఉద్యోగులు ప్రభుత్వాలు మారినప్పుడల్లా బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ప్రభుత్వ శాఖలో రిజర్వేషన్ల అమలు కోసం లైజనింగ్ అధికారులను నియమించాలని, పోస్టింగులు ప్రమోషన్లలో జనాభా దామాషా ప్రకారం ప్రాధాన్యం కల్పించాలని, ఎస్సీ,ఎస్టీ యాక్ట్ నుండి బీసీ ఉద్యోగులను మినయించాలని డిమాండ్ చేశారు.