హైదరాబాద్, ఆగస్టు8 (నమస్తే తెలంగాణ): బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా జాజుల శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా క్రాంతికుమార్ యాదవ్ ఎన్నికయ్యారు. సోమవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సంఘం జాతీయ కార్యవర్గ సమావేశం నూతన కమిటీని ఎన్నుకొన్నది. సమావేశంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు, 18 రాష్ట్రాలకు చెందిన బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.