హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): పంజాబ్ నేషనల్ బ్యాంక్కు రుణం ఎగ్గొట్టిన కేసులో ఏపీ బీజేపీ నాయకురాలు, అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త కొత్తపల్లి రామకోటేశ్వరరావుకు సీబీఐ కోర్టు ఐదేండ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. వారికి సహకరించిన బ్యాంక్ అధికారులు బీకే జయప్రకాశన్, కేకే అరవిందాక్షన్కు ఐదేండ్ల జైలు శిక్ష, విశ్వేశ్వర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు రూ.2 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
గతంలో విశ్వేశ్వర ఇన్ఫ్రా సంస్థకు డైరెక్టర్లుగా ఉన్నప్పుడు గీత, కోటేశ్వరరావు 2008లో బంజారాహిల్స్లోని పీఎన్బీ బ్రాంచ్ నుంచి రూ.42.79 కోట్ల రుణం పొందారు. బ్యాంకు అధికారులతో చేతులు కలిపి నకిలీ పత్రాలతో ఈ రుణం తీసుకొన్నట్టు పీఎన్బీ ఫిర్యాదు చేయడంతో 2015లో సీబీఐ బెంగళూరులోని బ్యాంకింగ్ నేరాల విభాగంలో కేసు నమోదు, చేసి చార్జిషీట్ దాఖలు చేసింది. అందులోని అభియోగాలను ఆమోదిస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది. పోలీసులు వీరిని చంచల్ గూడ జైలుకు తరలించారు.