హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలుచేయలేదని నలుగురు పోలీసు అధికారులకు రాష్ట్ర హైకోర్టు నాలుగు వారాల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించింది. ఈ తీర్పుపై అప్పీల్ చేసుకొనేందుకు శిక్ష అమలును ఆరు వారాలపాటు నిలిపివేసింది. ఏదైనా కేసులో నిందితులకు సీఆర్ పీసీ సెక్షన్ 41ఏ నోటీసు జారీచేయాలని, భార్యభర్తల వివాదంలో నిందితులైన భర్త, అత్తలకు నోటీసు జారీ చేయకపోవడం తమ మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని బీహార్ వర్సెస్ అర్నేశ్కుమార్ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. హైదరాబాద్ సిటీ పోలీస్ జాయింట్ కమిషనర్ (అప్పుడు వెస్ట్ జోన్ డీసీపీ) ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ ఎం సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ ఎస్ రాజశేఖర్రెడ్డి, ఎస్సై సీహెచ్ నరేశ్కు జైలు శిక్ష విధిస్తూ జస్టిస్ రాధారాణి తీర్పు చెప్పారు. జకా వినోద్ కుమార్రెడ్డి, ఆయన తల్లి సౌజన్యారెడ్డి దాఖలు చేసిన కోర్టు ధికార కేసును అనుమతించింది. తాము హైకోర్టులో కేసు వేస్తే పోలీసులు కౌంటర్ దాఖలు చేశారని, ఇదే పోలీసులు కింది కోర్టులో తాము పరారీలో ఉన్నట్టు పేరొన్నారని పిటిషనర్ల వాదన. పోలీసులకు వినతిపత్రాలు ఇచ్చామని, మెయిల్స్ చేశామని, దీనిపై పోలీసులు స్పందించలేదని సుప్రీంకోర్టు న్యాయవాది దిల్ జిత్సింగ్ అహ్లువాలియా చెప్పారు. ఇవన్నీ కోర్టు ధికార చర్యలే అవుతాయని హైకోర్టు పైవిధంగా తీర్పు వెలువరించింది.