హైదరాబాద్ : జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తీరుపై జనం ముక్కున వేలేసుకుంటున్నరు. ‘నేను బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన.. ఇప్పుడు కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే’ అని డాక్టర్ సంజయ్ అంటున్నరు. ఎమ్మెల్యే సంజయ్పై అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగిత్యాల అబివృద్ధి కోసం రేవంత్ రెడ్డిని కలిసి శాలువ కప్పుకున్నాడట. అంతే తప్ప పార్టీ మారలేంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు నేను ఎక్కడా చెప్పలేదట, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎక్కడా చెప్పలేదట. మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో కూడా సంజయ్కి ఇరువైపుల కూర్చున్న నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీ కండువాలు మెడలో వేసుకుని కూర్చున్నారు. ఇది చూస్తున్న జనం నవ్వుకుంటున్నారు.
మీడియానే తనపై తప్పుడు ప్రచారం చేసిందరి ఎమ్మెల్యే చెప్తున్నడు. బీఆర్ఎస్ పార్టీకి నెలకు రూ.5 వేలు కడుతున్నడట. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్లు అఫిడవిట్ కూడా ఇచ్చానని చెప్తున్నడు. ఈయన మాటలు టీవీలల్ల చూస్తున్న జగిత్యాల నియోజక వర్గ ప్రజలతోపాటు తెలంగాణ ప్రజానీకం పక్కున నవ్వుతున్నారు.
నేను బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన.. ఇప్పుడు కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే
జగిత్యాల అబివృద్ధి కోసం రేవంత్ రెడ్డిని కలిసి శాలువ కప్పుకున్నా అంతే
కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు నేను ఎక్కడా చెప్పలేదు.. రేవంత్ రెడ్డి ఎక్కడా చెప్పలేదు
నేను బీఆర్ఎస్ పార్టీకి నెలకు రూ.5 వేలు… https://t.co/FCb3GoWpIQ pic.twitter.com/lGq3X8Mu5i
— Telugu Scribe (@TeluguScribe) February 4, 2026