హైదరాబాద్ : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా(Medak MP) పోటీ చేయాలనే ఆసక్తి తనకు లేదని సంగారెడ్డి(Sangareddy) మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి(Jaggareddy) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమయం కలిసిరాక సంగారెడ్డిలో ఓడిపోయాను. ప్రజలు నాకు ఐదేండ్లు విశ్రాంతి ఇచ్చారు. వారందరికి కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీగా ఎవరిని నిర్ణయిస్తే వాళ్లే అభ్యర్థి అన్నారు. గెలిపిస్తే పని చేస్తా ఓడిపోతే విశ్రాంతి తీసుకుంటానని చెప్పారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ చేతిలో పరాజయం పొందిన విషయం తెలిసిందే.