హైదరాబాద్: తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్గా జగన్మోహన్రావు బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ వద్ద హాకా భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన బాధ్యతులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు.
ఈ నెల 16న సీఎం కేసీఆర్ పలువురు ఉద్యమకారులను కార్పొరేషన్ చైర్పర్సన్లనుగా నియమించారు. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, సాహిత్య అకాడమీ చైర్మన్గా జూలూరి గౌరీశంకర్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా గజ్జెల నగేశ్, షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దూదిమెట్ల బాలరాజు యాదవ్ను నియమించిన విషయం తెలిసిందే.