మునుగోడు : సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ గురించి మాట్లాడే అర్హత రాజగోపాల్రెడ్డికి లేదని విద్యుత్శాఖ మంత్రి రాజగోపాల్రెడ్డి అన్నారు. మునుగోడులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయన కాంగ్రెస్ను వీడి బీజేపీ పంచన చేరింది ప్రజల కోసంకాదని.. కాంటాక్టుల కోసమేనని విమర్శించారు. టీఆర్ఎస్లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలకు ఒక్క కాంటాక్ట్ ఇవ్వలేదని, అభివృద్ధి కోసమే వచ్చారన్నారు. కాంటాక్టులు ఇస్తే టీఆర్ఎస్లోకి వస్తానన్నది రాజగోపాల్రెడ్డేనన్నారు. రాజగోపాల్రెడ్డి ప్రజా ద్రోహి అనీ, స్వార్థం కోసమే రాజకీయాలు చేస్తున్నారన్నారు. దొంగలకు, ద్రోహులకు, గుత్తేదారులకు.. మునుగోడు ప్రజల చైతన్యానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అన్నారు.
రాజగోపాల్రెడ్డికి మూడోస్థానమే ఖాయమని, మునుగోడు అభివృద్ధి కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమని, ఇక్కడి ప్రజలకు ఈ విషయం తెలుసునన్నారు. కాంగ్రెస్ పాలనలో ఫ్లోరైడ్ వచ్చిందని, కరువు తాండవించిందన్న మంత్రి.. ఫ్లోరైడ్ను మిషన్ భగీరథతో రూపుమాపింది సీఎం కేసీఆర్ అన్నారు. ధరల పెంపుదలకు, నల్ల ధనాన్ని దాచుకునే దొంగలకు బీజేపీ నిలయమని, సంక్షేమ పథకాలను వద్దంటున్న బీజేపీలో రాజగోపాల్రెడ్డి చేరుతున్నాడన్నారు. ఆయన మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని, దేశ ప్రజలను, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్న మోదీపై అన్ని విషయాలను సభ ద్వారా కేసీఆర్ వివరిస్తారన్నారు. అన్ని మండలాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారన్నారు. మునుగోడు సభతోనే ఇక్కడ ప్రజల అభిప్రాయం స్పష్టంకానున్నదన్నారు.