కరీంనగర్ : మాలల అభివృద్దికై కృషి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని.. రాష్ట్ర మాల సంఘాల(Mala Sangam) జేఏసీ కన్వీనర్ నల్లాల కనకరాజు అన్నారు. బుధవారం కరీంనగర్లో మంత్రి గంగుల కార్యాలయంలో మాల సంఘ నేతలతో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ పార్టీకే అందిస్తున్నామని ప్రకటించారు. మెజార్టీ మాల సంఘాలు ఏకమై..జేఏసీగా ఏర్పాటు చేసుకున్నామని వివరించారు.
ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట ఉన్న ఏకైక కులం మాల కులమేనని గుర్తుచేశారు. సంక్షేమ పథకాలు అందించేందుకు మూడోసారి సీఎంగా కేసీఆర్ గెలువాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ తోపాటు పలు ప్రాంతాలలో పర్యటిస్తూ..కారుగుర్తుకే ఓటెయ్యాలంటూ మాలలను చైతన్యవంతులను చేస్తున్నామని పేర్కొన్నారు. గంగుల కమలాకర్(Gangula Kamalakar) నాయకత్వంలో కరీంనగర్ నియోజకవర్గం చాలా అభివృద్ది చెందిందని కొనియాడారు.
అంతర్జాతీయ స్థాయిలో నగరాన్ని డెవలప్ చేశారని గుర్తుచేశారు. మాలల సమస్యలను బీఆర్ఎస్ ప్రభుత్వ నెర వేరు స్తామన్నందుకే పూర్తి మద్దతు ప్రకటించామన్నారు. ప్రతి పట్టణంలో మాల భవనం కోసం స్థలాలను కేటాయిస్తూ..నిధులు అందించాలని కోరారు. గంగుల కమలార్ను భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. ఈ సమావేశంలో సంఘం చైర్మన్ చెరుకు రాంచందర్, రావుల అంజయ్య, జేఏసీ చీఫ్ అడ్వైజర్ రావుల అంజయ్య, గంటల రేణుక, తదితరులు పాల్గొన్నారు