హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : స్విమ్స్లో వైద్య పరికరాల కొనుగోలుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) రూ. 22 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు శుక్రవారం టీటీడీ పరిపాలన భవనంలోని ఆలయ ఈవో ఏవీ ధర్మారెడ్డి సమక్షంలో ఐవోసీఎల్, స్విమ్స్ అధికారులు ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఐవోసీఎల్ మార్కెటింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. స్విమ్స్లో రోగులకు వైద్య సహాయం కోసం కార్పొరేట్ సామాజిక బాధ్యతగా ఈ నిధులను అందించడం సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు.
తిరుమలలో భక్తులకు, స్విమ్స్, బర్డ్, చిన్న పిల్లల ఆసుపత్రుల్లో రోగులకు అందిస్తున్న సేవలను ధర్మారెడ్డి వివరించారు. కార్యక్రమంలో తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, జేఈవో సదా భార్గవి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, ఎఫ్ఏసీఏవో బాలాజీ, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్కుమార్, రాయలసీమ రీజినల్ హెడ్ రోహిత్ పాల్గొన్నారు.