Minister Sirnivas Goud | మహబూబ్నగర్ : దివిటిపల్లిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మే 6న ప్రారంభంకానుంది. ఈ మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఐటీ టవర్ ప్రారంభోత్సవంపై టీఎస్ఐఐసీ అధికారులతో మహబూబ్నగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐటీ టవర్కి వెళ్లే దారిని ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా జాతీయ రహదారి వద్ద పెద్ద ముఖ ద్వారం నిర్మించాలని అధికారులకు సూచించారు. ఐటీ టవర్ నుంచి మహబూబ్నగర్ పట్టణానికి అధునాతన రోడ్లను నిర్మించాలని ఆదేశించారు. సమావేశంలో టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ డీ రవి, డిప్యూటీ జోనల్ మేనేజర్ శ్యాంసుందర్ రెడ్డి, ప్రముఖ కన్సల్టెంట్ రాజ్ కుమార్, నిర్మాణ సంస్థ గుత్తేదారులు నరసింహ, రాజశేఖర్ రెడ్డి, అమర రాజా సంస్థ ప్రతినిధులు మసూద్, రవితేజ పాల్గొన్నారు.