హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : తెలుగు రాష్ర్టాల్లో ఐటీ సోదాలు కలకలం రేపాయి. వసుధ ఫార్మా కంపెనీని లక్ష్యంగా చేసుకొని మొత్తం 30కిపైగా బృందాలు సోదాలు జరిపాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్తోపాటు ఏపీలోని గుంటూరు, నరసాపురం, వైజాగ్, రాజమండ్రిలోగల వసుధ కార్పొరేట్ కార్యాలయాలు, చైర్మన్, డైరెక్టర్ల ఇండ్లల్లో అధికారులు సోదాలు చేశారు. ఈ దాడుల్లో అధికారులు కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
రాజ్పుష్ప లైఫ్ైస్టెల్లోనూ..
రామచంద్రాపురం/పటాన్చెరు, జనవరి 31 : సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాజ్పుష్ప లైఫ్ైస్టెల్ సిటీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఐదు వాహనాల్లో వచ్చిన ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. రాజ్పుష్ప, వెరిటెక్స్ సంస్థల్లో ఐటీ రిటర్న్లను పరిశీలించినట్టు సమాచారం.