హైదరాబాద్: హైదరాబాద్లో (Hyderabad) మరోసారి ఐటీ దాడులు (IT raids) కలకలం సృష్టించాయి. నగరంలోని రియల్ ఎస్టేట్ సంస్థలపై (Real estate companies) ఇన్కమ్ ట్యాక్స్ (ఐటీ) అధికారులు దాడులు చేస్తున్నారు. దిల్సుఖ్నగర్లోని (Dilsukhnagar) గూగి ప్రాపర్టీస్ సంస్థ (Googee properties) ప్రధాన కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫార్మా హిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీతోపాటు పలు రియల్ ఎస్టేట్ కంపెనీలపై దాడులు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో నగరంలోని 20 చోట్ల అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
గత నెలాఖరున కూడా హైదరాబాద్లోని నాలుగు స్థిరాస్తి సంస్థలపై ఆదాయపన్ను శాఖ భారీఎత్తున దాడులు నిర్వహించింది. ఎస్ఆర్ నగర్లోని వసుధ సంస్థ ప్రధానకార్యాలయంతోపాటు మాదాపూర్, జీడిమెట్లలోని రియల్ ఎస్టేట్ కంపెనీల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయ సంస్థలు నిర్వహిస్తున్న వ్యాపారా లావాదేవీలు, చెల్లిస్తున్న ఆదాయపన్నుకు వ్యత్యాసం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.