హైదరాబాద్: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ వస్త్ర, టెక్స్టైల్ వ్యాపార సంస్థకు చెందిన బ్రాంచ్లు, యజమానుల ఇండ్లలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని మాదాపూర్, హైటెక్సిటీ, కూకట్పల్లి సహా ఆరోచోట్ల ఏకకాలంలో 15 బృందాలు తనిఖీలు చేపట్టాయి.