IT Minister KTR | మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఈఐటీ ఆధ్వర్యంలో రూపొందించిన నిర్మించిన స్కై వాక్ను రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు సోమవారం ప్రారంభించారు. కిలో మీటర్ దూరం నిర్మించిన ఈ స్కైవాక్ రాయ్దుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి మైండ్ స్పేస్ మాదాపూర్ క్యాంపస్తో కలుపుతుంది. రాయ్దుర్గ్ మైట్రో స్టేషన్కు, మైండ్ స్పేస్ మాదాపూర్ క్యాంపస్ మధ్య కనెక్టివిటీ మెరుగు పడటంతోపాటు ట్రాఫిక్ రద్దీ తగ్గిపోతుంది. రాయ్దుర్గ్ మెట్రో స్టేషన్ ఎన్కోర్స్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు.
కిలోమీటర్ పొడవునా వృత్తాకారంలో నిర్మించిన ఈ స్కై వాక్తో రాయ్దుర్గ్ మెట్రో స్టేషన్-మైండ్ స్పేస్ మాదాపూర్ క్యాంపస్ చుట్టు పక్కల ప్రాంతాలను కలుపుతుంది. ఈ స్కై వాక్ కిలోమీటర్ పొడవుతోపాటు 3.5 కిలోమీటర్ల వెడల్పుతో నిర్మించారు. ప్రజోపయోగ మౌలిక వసతుల కల్పనలో అత్యద్భుతమైన జోడింపుగా ఇది నిలువనుంది. అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దడంతో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గడంతోపాటు పాదచారులు సులభంగా రోడ్లను దాటగలమన్న భరోసా కల్పిస్తున్నది.
ఆరు స్టెయిర్కేసులు, ఐదు ఎస్కలేటర్లు, నాలుగు లిఫ్ట్లతో రూపుదిద్దుకున్నది ఈ స్కైవాక్. అత్యంత అనుకూలమైన డిజైన్తో దీన్ని మరింత సమ్మిళితంగా తీర్చిదిద్దారు. దివ్యాంగులకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేశారు. భద్రత, కమ్యూనిటీ అభివృద్ధిపై అధికంగా దృష్టి కేంద్రీకరించిన ఈ స్కైవాక్, మైండ్స్పేస్ మాదాపూర్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, సామాన్య ప్రజలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. స్కైవాక్ ఈ-ఇంటర్సెక్షన్లో వింటేజ్ కేఫ్ ఉంది. డిజైన్ పరంగా అత్యద్భుతంగా ఉండే ఈ 17వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేఫ్ ప్రాంగణం ఉంది. ఇది వివిధ సంస్థల ఉద్యోగులు కలుసుకునేందుకు, పరిచయాలు పెంచుకునేందుకు అత్యాధునిక వినియోగ ప్రాంగణంగా నిలువనుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ అండ్ సీ శాఖల ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఈ వెంకట్ నరసింహా రెడ్డి మరియు ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ స్కైవాక్ అభివృద్ధి చెందుతున్న వ్యాపార పార్క్ను నగరంలోని కీలకమైన ప్రజా రవాణా మార్గాలతో కలుపుతుంది. ప్రయాణం, సౌకర్యంల నడుమ అత్యుత్తమ సమ్మేళనంగా ఇది నిలుస్తుంది.
ఈ కార్యక్రమంలో మైండ్స్పేస్ బిజినెస్ పార్క్స్ ఆర్ఈఐటీ సీఈఓ వినోద్ రోహిరా మాట్లాడుతూ ‘ప్రజలకు సేవలందించేందుకు ఈ స్కైవాక్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. మాదాపూర్ మైండ్ స్పేస్ను విస్తృతంగా ఆధునీకరించే వ్యూహంలో భాగంగానే ఈ స్కైవాక్ నిర్మించాం. నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తూ అత్యున్నత నాణ్యత కల ఆధునిక సౌకర్యాలను తీర్చిదిద్దాలన్నది లక్ష్యం. మేం మా నివాసితులకు భద్రత, సౌకర్యం, అతి సులభమైన రవాణాతో కూడిన వసతులు అందించాలని నమ్ముతుంటాం. తద్వారా అభివృద్ధి చెందుతున్న వ్యాపార జిల్లాను సృష్టిస్తున్నాం’ అని అన్నారు.
ఆలోచనాత్మకంగా తీర్చిదిద్దిన ఈ స్కైవాక్ డిజైన్, ఓ చెట్టును పోలి ఉంటుంది. దీనికి మద్దతునందించే నిర్మాణాలు సహజసిద్ధమైన బ్రౌన్లో చిత్రించిన చెట్టు, అబ్స్ట్రాక్ ఆర్టిస్టిక్ వివరణ అనిపించే రీతిలో ఉంటాయి. స్టీల్ రూపాన్ని సరళంగా మార్చేందుకు ఉడెన్ అల్యూమినియం మిశ్రమ ప్యానళ్లతో పూర్తి చేశారు. అన్ని వాతావరణ పరిస్ధితులనూ తట్టుకునే టెన్సిల్ ఫ్యాబ్రిక్తో అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన ప్యానెల్స్ పాదచారులు నేరుగా సూర్యకాంతి బారీన పడకుండా ఉపశమనం కలిగిస్తాయి.