హైదరాబాద్: ఢిల్లీలో ఈ నెల 28వ తేదీన కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రారంభోత్సవానికి వెళ్లేది లేనిది రేపు చెబుతామని భారత రాష్ట్ర సమితి ఎంపీ కే కేశవరావు(BRS MP K Keshava Rao) తెలిపారు. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరుకావాలన్న అంశంపై ఇంకా తామేమీ నిర్ణయం తీసుకోలేదని, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి హాజరుకావడం కుదరకపోవచ్చు అని, కానీ తమ నిర్ణయాన్ని మాత్రం రేపు ప్రకటిస్తామని ఆయన అన్నారు.
We have not taken any decision yet, we are yet to take a call. It is unlikely that we will attend but we'll announce our decision tomorrow: BRS MP K Keshava Rao pic.twitter.com/jYRMbApwhm
— ANI (@ANI) May 24, 2023
విపక్షాలు పార్టీలు దాదాపు తమ నిర్ణయాన్ని ప్రకటించేశాయి. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి హాజరుకావడం లేదని ఇప్పటికే కొన్ని పార్టీలు తేల్చేశాయి. పార్లమెంట్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తెలిపారు.
#WATCH | We will boycott this (the inauguration of the new Parliament building): Bihar Deputy CM and RjD leader Tejashwi Yadav pic.twitter.com/jRCPzC2AXs
— ANI (@ANI) May 24, 2023
ప్రారంభోత్సవానికి తాము కూడా హాజరుకావడం లేదని ఎన్సీపీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని అన్ని విపక్ష పార్టీలు బహిష్కరిస్తున్నాయని, మేం కూడా ఆ కార్యక్రమానికి వెళ్లడం లేదని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు.
#WATCH | All opposition parties have decided to boycott the inauguration of the new Parliament building on 28th May and we will also do the same: Uddhav Thackeray faction leader Sanjay Raut pic.twitter.com/mvQNO0ib0h
— ANI (@ANI) May 24, 2023